బాద్‌షా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో తెలంగాణ బిడ్డ మరణించినా సంతాపం తెలపకుండా ఆడియో ఫంక్షన్‌ నిర్వహించడం సీమాంధ్ర అహంకారానికి నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బాద్‌షా సినిమాను బహిష్కరిస్తున్నామని ఎంపీ విజయశాంతి అన్నారు. ఆదివారం సాయంత్రం నానకరాం గూడలోని రామానాయుడి స్టూడియోలో జరుగుతున్న ఆడియో కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో వరంగల్ లోని ఉర్సు గుట్టకు చెందిన రాజు మృతి చెందిన సంగతి తెలిసిందే.

0 comments :