హీరో  'శ్రీకాంత్' తో రాజరాజేశ్వరి పిక్చర్స్  చిత్రం : 'మొండోడు'
ప్రముఖ నటుడు 'శ్రీకాంత్' హీరోగా జర్నలిస్ట్ 'ప్రభు'ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ పతాకంపై నిర్మాత రాజరాజేశ్వరిశ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కాగా ఈ చిత్రానికి 'మొండోడు' అనే పేరును నిర్ణయించినట్లు చిత్ర దర్శక  నిర్మాతలు తెలిపారు.

 'మొండోడు' రాజు కన్నా బలవంతుడు అన్న సామెత చందాన..ఈ చిత్రంలో కధానాయకుడు కూడా 'మంచి కోసం, తనకు నచ్చిన పని చేయటంకోసం, తనను నమ్మిన, తాను నమ్మిన వారికోసం ఎంతకైనా తెగించే మనిషి. ఈ విషయంలో ఎవరినీ లెక్క చేయని మొండి తనం అతనిసొంతం.కధానాయకుని పాత్ర తీరు తెన్నులు, స్వరూప స్వభావాలను బట్టి చిత్రానికి 'మొండోడు' అనే పేరును నిర్ణయించాము అన్నారు.యాక్షన్.సెంటిమెంట్ నేపధ్యంలో జరిగే ఓ వైవిధ్యమైన కధతో ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు జర్నలిస్ట్ 'ప్రభు' అన్నారు.
ఈ సందర్భంగా  నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 30 తో చిత్రం షూటింగ్ ముగుస్తుందని  తెలిపారు. ప్రస్తుతం ఫిలింసిటీ లో శ్రీకాంత్ పై ఓ సందర్భోచిత గీతాన్ని స్వర్ణ మాస్టర్ నృత్య దర్సకత్వంలో చిత్రీకరిస్తున్నాము. అలాగే కధానాయకుని చిన్న తనానికి సంభందించిన దృశ్యాలను చిత్రీకరించాము. ఎడిటింగ్ వర్క్ కూడా ప్రారంభమయింది. ఈ నెల 28 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభ మవుతాయి. జులై నెలాఖరున గానీ,ఆగస్టు ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నట్లు నిర్మాత తెలిపారు.
 కధానాయకుడు శ్రీకాంత్ 'దొంగ' గా, నాయిక 'టీచర్' గా కనిపించే ఈ చిత్రంలోని  
ఇతర ప్రధాన పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.

కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్:పాటలు: శ్యాం కాసర్ల  ఎడిటింగ్: నాగిరెడ్డి : సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: 
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు 

Categories:

0 comments :